హనుమంతుడు - కార్యదీక్ష
హనుమంతుడు - కార్యదీక్ష
సముద్రం దాటటం - సీతాన్వేషణ అనే కార్యం హనుమపై పడింది. దానికి సంబంధించి కనీస సమాచారమేదీ ఆయనకి అందజేయబడలేదు.
ఆ ప్రయత్నంలో ప్రలోభాలూ, ప్రమాదాలూ ఎదురవుతూ వచ్చాయి. కానీ వాటన్నిటినీ హనుమ అధిగమిస్తూ, అప్పటికప్పుడు ఎదుర్కొన్న తీరూ - ముందుకు సాగిన పద్ధతులూ, ఆయన ఏకాగ్రతకూ కార్యదీక్షకూ అద్దం పడుతాయి.
అందులో కొన్ని
అ) సముద్ర లంఘనము
(i) ప్రలోభం:
మైనాకునిపై విశ్రమించక సాగిపోవడం.
సముద్రుని కోరికమేరకు మైనాకుడు తనపై విశ్రమించి వెళ్ళమన్నాడు.
మధ్యలో ఆగనని (రామబాణం) ప్రమాణం చేశాననీ, సమయం కూడా మించిపోతోందనీ చెప్పి ముందుకు సాగాడు.
(ii) పరీక్ష:
సురస తన నోటిలోకి ప్రవేశించమని హనుమని పరీక్షించదలచ కోరింది. హనుమ బొటనవ్రేలు పరిమాణంలో అయి, సురస కోరినట్లు నోటిలోకి ప్రవేశించి, ఉపాయంతో బయటకు వచ్చాడు.
(iii) అకస్మాత్ హింస:
నీడను బట్టీలాగే సింహికను మర్మావయవాలు ఛేదించి సంహరించాడు.
ఆ) ప్రవేశ ప్రయత్నం:
లంకాధిదేవత అడ్డగించింది. ఆమెను ఎదుర్కొని, ఆమె అనుమతితో లంకలోనికి ప్రవేశించాడు.
ఇ) నిగ్రహం:
అంతఃపురంలో స్త్రీలను చూడడమే ధర్మలోపం అనీ, అయినా తన మనస్సు ఎట్టి వికారాలకూ లోనవలేదనీ తలచుకున్నాడు. తప్పిపోయిన స్త్రీని స్త్రీల మధ్యలోనే కదా వెదకవలెననే సూత్రంతో వెదికాడు.
ఈ) ఉత్సాహము:
సీతాన్వేషణలో ఫలితము కనబడనప్పుడు నిరాశ ఆవహించినా, "ఉత్సాహమే సంపదకు మూలమని" జ్ఞప్తికి తెచ్చుకొని, ప్రార్థన చేసి, సీతాదర్శనాన్ని పొందగలిగాడు. .
ఉ) సంభాషణ ప్రణాళిక:
సీతాదేవితో మాట్లాడడానికి వివిధ విశ్లేషణలు చేసి, ఆమెకు రామకథాగానం వినిపించి, పనులు చక్కబెట్టాడు.
ఊ) రాక్షసులను రప్పించి దాడి:
అశోకవనం ధ్వంసంచేసి, పర్యవసానంగా పంపబడ్డ కింకరులు, జంబుమాలి మొదలగు రాక్షసులతో తలపడి సంహరించాడు.
ఋ) జయఘోష, హెచ్చరిక:
కింకరులు వచ్చినపుడు జయఘోష చేశాడు. అనంతరం వారిని సంహరించాడు. లంకలో అందరికీ "ఇక్ష్వాకు వంశీయులతో వైరం వల్ల లంకగానీ, లంకలోనివారుగానీ, రావణుడుగానీ ఉండబోరు" అని హెచ్చరిక చేశాడు.
ఋూ) సహనం - కార్యాలోచన:
ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి చేష్టలుడిగినా, తేరుకుని, అస్త్రం విడిపోయినా, బంధింపబడి, హింస సహించాడు. తద్వారా రావణ సభకు చేరుకో గలిగాడు.
ఌ) ఉపదేశం:
రావణునికి ధైర్యంగా వాస్తవం తెలుపుతూ, సరియైన సలహా ఇచ్చాడు.
ౡ) వచ్చిన అవకాశం - మెఱుపుదాడి:
తోకను అంటిస్తే, వివిధ కోణాలలో ఆలోచించి, త్రిజట కలలో చెప్పిన "వానరుడు లంకను తగులబెడుతున్న" విషయం జ్ఞప్తికి వచ్చిందేమో అన్నట్లు, లంకా దహనం కావించాడు.
ఎ) సమయపాలన:
సీతాదేవి విశ్రమించివెళ్ళమని అన్నా, తిరుగు ప్రయాణమయ్యాడు.
ఏ) నివేదిక:
తిరిగి వచ్చిన హనుమ వానరులతో "చూచాను సీతను" అంటూ, సుదీర్ఘంగా విషయాలు తెలిపాడు.
శ్రీరామునితో మాత్రం, తన గొప్ప చెప్పుకోక, తెలుపవలసిన ముఖ్యవిషయాలు తెలియజేశాడు.
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగతా I
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్ ॥
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి