గురుపూర్ణిమ

 


గురుపూర్ణిమ 

విద్య వికాసానికి మూలం. తమస్సు తొల గించి, జీవనాన ఉషస్సు కలిగించి, శాశ్వతమైన తేజస్సు అందించేది విద్య. మాయ, అవిద్యలు మనిషిని ఆవరించి ఉంటాయి. వాటివల్ల జన్మ మృత్యు జరా వ్యాధులు ఏర్పడతాయి. చిత్త భ్రమ, విభ్రాంతులు సంభవిస్తాయి. అలాంటి వాటిని తన జ్ఞానకాంతులతో పారదోలే దివ్య చైతన్య స్ఫూర్తి- గురువు. అజ్ఞానాంధకా రాన్ని తొలగించి శిష్యుల అంతఃకరణాల్ని శుద్ధిచేసే మహితాత్మ స్వరూపం-గురువు. జ్ఞానశక్తితో, ఉదాత్తమైన యుక్తితో శిష్యుల సందేహాల్ని నివృత్తి చేస్తూ వారి అభ్యున్నతిని ఆకాంక్షించే త్రిమూర్తుల ఆకృతి- గురువు.

సనాతన భారతీయ సంప్రదాయంలో గురు వుకు విశేషమైన స్థానం ఉంది. ఏ తరహా విద్యను నేర్పే గురువైనా పూజనీయుడే! తల్లి దండ్రుల తరవాత అంతటి సమున్నతమైన స్థితి గురువులది. ఆచరించి చూపి విద్యార్థు లకు ఆలంబనగా నిలిచేది ఆచార్యుడు. అలాంటి ఆచార్యుడు ఆరాధనీయ మూర్తిమత్వ స్వరూపుడని 'నిరుక్తం' ప్రకటించింది. 'విద్యాదా నాన్ని మహాయజ్ఞంగా భావించే ఉత్తమ గురువు సాక్షాత్తు పరబ్రహ్మ అంశతో వ్యక్తమ వుతాడు. శ్రద్ధాసక్తులతో, భక్తి విశ్వాసాలతో గురువు నుంచి జ్ఞానాన్ని అందుకునే విద్యార్థికి భవిష్యత్తు బంగారు మయమవుతుంది' అని మనుస్మృతి ప్రస్తావించింది. విద్యాభ్యాసం ద్వారా హితోపదేశం చేయడమే కాక అభ్యు దయ మార్గాన్ని దర్శింపజేసేవాడే గురువని శుక్రనీతి' తెలియజేసింది. అందుకే ఈశ్వరు డికి, ఆత్మశక్తికి, గురువుకు మధ్య భేదం లేదని ఆదిశంకరులు పేర్కొన్నారు.

కృతయుగంలో దక్షిణామూ ర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రే యుడిగా, ద్వాపర యుగంలో వ్యాసుడిగా, కలియుగంలో ఆదిశంకరాచార్యుడిగా గురు స్వరూపం భాసిల్లింది. భార తీయ ఆర్ష వాంగ్మయంలో వేదవ్యాసుడికి ప్రముఖ పాత్ర ఉంది. మేధాశక్తి, ధర్మదీక్ష, ఆధ్యాత్మిక పరిణతి, జ్ఞాన పటి మలతో వ్యాసమహర్షి సనా తన సంప్రదాయ సారస్వత విజ్ఞానాన్ని పరిపుష్టం చేశారు. నేటి ఆషాఢ శుద్ధ పౌర్ణమి-

వ్యాస జయంతి. గురు పరంపరలో విఖ్యాతి చెందిన వ్యాసుడు నిండు పున్నమి రోజున ఆవి ర్భవించి, తన సుజ్ఞానమనే సిరివెన్నెల వెలుగులతో ఆర్ష ధర్మాన్ని, ఆధ్యాత్మిక సంప్రదా యాన్ని దీప్తిమంతంగా ఆవి ష్కరించారు. అమూల్యమైన వేదరాశిని సంస్కరణ చేసి, నాలుగు వేదాలుగా విభజించి, వేద వ్యాసుడయ్యారు. అష్టాదశ పురాణాలను, ఉప పురాణాల్ని రచించారు. భక్తి ప్రాధాన్యమైన భాగవత మక రందాన్ని అందించారు. తాను దర్శించిన బ్రహ్మతత్వాన్ని బ్రహ్మసూత్రాలుగా ప్రకటిం చారు. చతుర్విధ పురుషార్థాల సాధన కోసం పంచమ వేదమైన మహా భారతాన్ని సృజించి, జాతికి అమూల్య కాను కగా అనుగ్రహించారు. నాలుగు ముఖాలు లేని బ్రహ్మగా, రెండు చేతులు మాత్రమే ఉన్న విష్ణువుగా, ఫాలనేత్రం లేని పరమేశ్వరుడిగా వేదవ్యాసుణ్ని భారతీయ సనాతన ధర్మం అభి వర్ణించింది. 'గురోద్గురువు' అనే విశేషణం వ్యాసుడికి దక్కిన కీర్తి కిరీటం. పరంపరాగ తంగా ప్రభవించిన అనేకమంది సద్గురువులకు వ్యాసుడు ఆరాధ్యుడు.

శ్రీకృష్ణ పరమాత్మకు సమకాలీనుడిగా వ్యాసుడు అవతరించి కృష్ణ ద్వైపాయనుడిగా ఆది గురువుగా తేజరిల్లాడు. గురుపూర్ణిమ పర్వదినాన్ని వేదవ్యాసుడి పరంగానే జరుపుకో వాలని 'గణేశ పురాణం' నిర్దేశించింది. నైమిశా రణ్యంలో వేదవ్యాసుడు తపస్సు చేసి గణపతి సాక్షాత్కారం పొందిన రోజు ఆషాఢ పౌర్ణమిగా

చెబుతారు. సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, దర్శక గురువు, మహా గురువు, పరమ గురువు... ఇలా ఎన్నో విధాలుగా గురు సంవిధానం పరిఢవిల్లుతోంది. ఈ గురు స్వరూపాలన్నింటి ఏకీకృత మూర్తిమత్వం-వేదవ్యాసుడు. ఆచార్య పీఠాన్ని అధిరోహించి ఎందరెందరో సద్గురువుల్ని, శిష్యకోటిని ప్రభా వితం చేసిన విశిష్ట వైభవోపేత గురు సార్వ భౌముడు- వేద వ్యాసుడు! వ్యాసుడు ప్రసాదిం చిన జ్ఞాన సంపదవల్లే భరత ఖండం- తపో భూమిగా, వేదభూమిగా, దేవభూమిగా, ముక్తి పథగామిగా సాకారమైంది. వ్యాసుడు సృజిం చిన సారస్వతం వల్ల దివ్యధాత్రిగా ప్రపంచానికే ఆదర్శప్రాయమైంది.

సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

  2. #gurupurnima #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025