పోస్ట్‌లు

ఆగస్టు, 2026లోని పోస్ట్‌లను చూపుతోంది

నమ్మకద్రోహం-జ్యోతిష విశ్లేషణ

చిత్రం
  నమ్మకద్రోహం-జ్యోతిష విశ్లేషణ నమ్మకద్రోహం, లేదా నమ్మించి మోసం చేయడం లేదా ఏమార్చడం అనేది సమాజంలో అత్యంత ప్రమాదకరమైన విషయం. ప్రేమికుల విషయంలో, కొందరి భార్యాభర్తల విషయంలో, స్నేహితులు లేదా వ్యాపార భాగస్వామి మధ్య నమ్మకద్రోహం ఏర్పడినప్పుడు నమ్మినవారు నమ్మకాన్ని సంపదను పోగొట్టుకోవడంతోపాటు మానసిక బాధకు గురి అవుతారు. జ్యోతిష్యం ప్రకారం ఒకరి జాతకంలో ఎటువంటి గ్రహ కాంబినేషన్ ఉన్నప్పుడు నమ్మకద్రోహం చేస్తారు అనేది పరిశీలించవచ్చు. రాహువు అత్యాశ, ఈగో ప్రాబ్లంకు కారకుడు. తరువాత కర్మ కారకుడు శని భగవానుడిని కూడా పరిశీలించాలి. మనసులోని తెలివైన ఆలోచనలకు కారకుడైన బుధుడు, కోరికలకు కారణమైన శుక్ర భగవానుడు. నమ్మకద్రోహానికి ప్రధాన కారకుడు అయిన రాహువు శని భగవానుడు నక్షత్రంలో ఉన్నప్పటికీ లేదా శని భగవానుడి నక్షత్రంలో రాహువు ఉన్నప్పుడు లేదా శని భగవానుడికి ముందు కానీ వెనుక గాని రాహువు ఉన్నప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. బుధుడు మరియు శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నప్పుడు గానీ లేదా బుధుడు శుక్రుడు కలిసి శని భగవానుడు స్థానంలో ఉండి లగ్నంతో కానీ లగ్నాధిపతితో కానీ సంబంధం ఏర్పడినప్పుడు జాతకులు నమ్మకద్రోహం చేసేవారిగా గాని లేద...

వివాహ-మాంగల్య దోషం

చిత్రం
  వివాహ-మాంగల్య దోషం వైవాహిక జీవితంలో అల్లకల్లోలం దురదృష్టకరమైన సంఘటనలు జరగడం,వివాహ జీవితం బాధాకరంగా మారడం ఇటువంటివి జాతకంలో మాంగల్య స్థానం దోషం ఉంటే జరుగుతాయి.రెండు వివాహాలు మాంగల్య దోషం కారణంగా ఏర్పడతాయి.దీనికి ఏయే గ్రహాలు కారణాలు వహిస్తాయి దీనికి పరిహారం ఏమిటి అనేది చూద్దాము.  రాహుకేతువులు లగ్నంలో కానీ కుటుంబ స్థానంలో కానీ  ఉంటే ఈదోషం ఏర్పడుతుంది.దీనినే కళత్ర దోషం నాగ దోషం అని కూడా అంటారు.వీటితోపాటు సప్తమాధిపతి మరియు కళత్రకారకుడు శుక్రుడు  ఒకరి జాతకంలో శుక్రుడు నీచ పొంది కొద్దిగా కూడా బలం లేకపోతే  వివాహాలు కాకపోవచ్చు లేదా, ఒకటికి మించి వివాహాలు జరగవచ్చు. అలాగే కుజ దోషం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వివాహ సమస్యలు ఏర్పడతాయి. కుజ శుక్రుల కలయికలో కూడా వివాహ దోషాలు ఏర్పడతాయి. శని భగవానునికి రవికి గాని  కళత్ర స్థానానికి స్థితి గాని, దృష్టి గాని ఉన్నప్పుడు వివాహ జీవితం ఒక చేదు అనుభవంగా మిగిలి పోతుంది. కాల పురుష రాశులైన వృషభం,తుల  రాశులు పాడైనప్పుడు వివాహం ఆలస్యం,లేదా దోషం ఏర్పడతాయి. జాతకం లో రాహువు వృషభం లోనూ,కేతువు వృశ్చికం లోనూ,శని భగవానుడు తులలో ఉండి  న...
చిత్రం
  ప్రేమ వివాహాలు ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు అంటే ఒకటి వివాహం ఆలస్యం అవుతుంది అని మరొకటి పిల్లలకు ప్రేమవాహాలు అవుతాయా లేదా తమ మాట విని తాము చెప్పిన సంబంధం చేసుకుంటారా లేదా అని టెన్షన్ పడుతుంటారు. ప్రేమ వివాహాలు జాతకంలో ఉంటే కచ్చితంగా జరుగుతాయి అది ఏ విధంగా చూడాలి అనేది ఈరోజు పరిశీలిద్దాము. ప్రేమ వివాహాలు చాలా కారణాలు ఉంటాయి ఉదాహరణకు శుక్రుడు తో రాహు కలిసి ఉంటే వారికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే శుక్రుడుతో శని భగవానుడు లేదా లేదా గురువు కలిసి ఉంటే ఆ జాతకులకు నూటికి నూరు శాతం అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే అవుతుంది. శుక్రుడు కుజుడుతో కలిసి ఉంటే ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు ప్రేమ వివాహాలకు మాత్రమే కాదు వివాహ అనంతరం కూడా దంపతులు సంతోషంగా ఉండాలంటే శుక్రుడే కారకుడు. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ప్రేమ వివాహాలను పెద్దలు అంగీకరిస్తారు అంతేకాకుండా వివాహ అనంతరం కూడా దంపతులు సంతోషంగా ఉంటారు. శుక్రుడు 6 8 12 స్థానాలలో ఉన్నప్పుడు లేదా శుక్రుడు వక్రంచి ఉన్నప్పుడు ప్రేమ వివాహాలు ఫెయిల్ అవుతాయి. రాహు ఐదవ స్థానంలో ఉన్నప్పుడు ప్రేమ వి...

కోరిక , లక్ష్యం ల మధ్య తేడా :

చిత్రం
 కోరిక , లక్ష్యం ల మధ్య తేడా : పురాణాల్లో ఋషులు , గౌత కోరిక , లక్ష్యం ల మధ్య తేడా : మ బుద్ధుడు కోరికలు లేనప్పుడే మనిషి ప్రశాంతంగా ఉంటాడని, కోరికలే మనిషి యొక్క అన్ని బాధలకు కారణం అని చెప్పారు. ఏ విధమైన కోరికలు లేనపుడు మనిషి జీవితం నిస్సారంగా , నిస్తేజం గా అనిపిస్తుంది. అసలు కోరిక, లక్ష్యం రెండు ఒకటేనా? వేర్వేరా?. ఇంచుమించు రెండు ఒకటే కానీ ఒక ప్రధానమైన తేడా ఉంది. కోరిక అనేది చెడ్డది. లక్ష్యం అనేది మంచిది. సాధారణంగా మనిషికి చాలా రకాల కోరికలు ఉంటాయి మనకున్న కోరికల వల్ల ఇతరులకు, సమాజానికి హాని కలిగితే వాటిని కోరికలు అనవచ్చు. అదేవిధంగా మనకున్న కోరికల వల్ల ఇతరులకు, మనకు, సమాజానికి మంచి జరిగితే అటువంటి కోరికలను లక్ష్యాలు అనవచ్చు . చెడ్డ కోరికల వాళ్ళ అందరికి చేదు జరుగుతుంది కాబట్టి పురాణాల్లో ఋషులు ఆ విధంగా కోరికలు ఉండకూడదు అని చెప్పారు సర్వేజనా సుఖినో భవంతు   శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు...

ఇచ్ఛాశక్తి

చిత్రం
  ఇచ్ఛాశక్తి మానవ జీవితంలో విజయానికి పునాదులైన శక్తులలో ముఖ్యమైనవి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇవి పరాశక్తి ప్రధాన స్వరూపాలు. ఏ కార్యమైనా ముందుగా ఒక చిన్న కోరికగా మనసులో మొలకెత్తుతుంది. అది సంకల్పంగా మారి, తగిన జ్ఞానాన్ని సంపాదించి, చివరికి క్రియాశక్తి ద్వారా కార్యసిద్ధికి దారితీస్తుంది. ఇచ్ఛాశక్తి లేకుండా ఏ కార్యమూ మొదలు కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘‘ఉద్ధరేత్‌ ఆత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్‌ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః’’ అంటాడు. అంటే- మనిషి తన ఇచ్ఛాశక్తి ద్వారానే తనను తాను అభివృద్ధి చేసుకోవాలి. ఒకవేళ ఆ కోరిక బలహీనతకు కారణమైతే, అదే అతడి శత్రువుగా మారుతుంది.  ఏ కార్యం చేపట్టినా ఆ దిశగా ప్రయాణంలో త్రిగుణాలు ఆటంకాలు కలిగించవచ్చు. అయితే ఆ పని మనకు ఇష్టమైనదైతే, ఎన్ని ఆటంకాలొచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటాం. అదే ఇష్టం లేని పనైతే, చిన్న ఇబ్బందులనే పెద్ద అడ్డంకులుగా భావించి ముందుకు వెళ్లం. కాబట్టి, చేపట్టే ప్రతి పనినీ కర్తవ్యంగా భావిస్తే అది ఇష్టంగా మారుతుంది. ఇష్టం పెరిగినప్పుడు ఇచ్ఛాశక్తి బలపడుతుంది. అప్పుడు కార్యసాఫల్యానికి కావాల్సిన జ్ఞానాన్ని సంపాదించే తపన కల...

తదియ - స్వర్ణగౌరీ వ్రతం

చిత్రం
  తదియ - స్వర్ణగౌరీ వ్రతం ఈశ్వరుడు చెప్తున్నాడు- బ్రహ్మపుత్రా! శ్రావణశుక్లపక్షంలో తదియనాడు శుభప్రదమైన స్వర్ణగౌరీవ్రతాన్ని ఆచరించాలి. ప్రాతఃకాలంలో స్నానం చేసి, నిత్యకర్మలను ఆచరించి వ్రతం చెయ్యడానికి సంకల్పం చెప్పుకోవాలి. పిమ్మట పార్వతీశంకరులను షోడశోపచారాలతో పూజించాలి. పూజ అనంతరం భవానీదేవి ప్రీతి కొరకు వరినూక, అన్నములతో చేసిన పదహారు రకాల వంటకాలను పదహారు కంచుపాత్రలలో పెట్టి దంపతులకు - దేవ దేవ సమాగచ్ఛ ప్రార్థయేఽహం జగత్పతే, ఇమాం మయా కృతాం పూజాం గృహాణ సురసత్తమ.  వాయనాని ప్రదేయాని దమృతీభ్యస్తు షోడశ, భవాన్యాశ్చ మహాదేవ్యా వ్రతసమ్పూర్ణహేతవే... అని ప్రార్థించి వాయనం ఇవ్వాలి. తరువాత “ప్రీతయే ద్విజవర్యాయ వాయనం ప్రదదామ్యహం” అని ప్రార్థించి బ్రాహ్మణునకు వాయనం ఇవ్వాలి. అటుపిమ్మట అలంకృతులైన పదహారుమంది దంపతులకు లేదా సువాసినులకు వస్త్రాది భూషణాలను సమర్పిస్తూ ఇలా ప్రార్థించాలి- కుర్యాద్వస్త్రాదిభిర్యుక్తాన్యాహూయ ద్విజదమ్పతీన్,  వ్రత సంపూర్ణతార్థం తు బ్రాహ్మణేభ్యో దదామ్యహం.  స్వలంకృతాః సువాసిన్యః పాతివ్రత్యేన భూషితాః,  మమ కార్యసమృద్ద్యర్థం ప్రతిగృహంతు శోభనాః. ఈ విధంగా పదహారు సంవత్సర...

దక్షిణామూర్తి స్వామి చేతిలోని చిన్ముద్ర వెనుక ఉన్న మహత్తరమైన జ్ఞాన రహస్యం

చిత్రం
దక్షిణామూర్తి స్వామి చేతిలోని చిన్ముద్ర వెనుక ఉన్న మహత్తరమైన జ్ఞాన రహస్యం   శివుడు గురువుగా దర్శనమిచ్చే స్వరూపమే శ్రీ దక్షిణామూర్తి. ఆయనకు ప్రత్యేకమైన ఆయుధాల కంటే మౌనం మరియు చిన్ముద్ర ద్వారా జ్ఞానబోధ చేసే రూపమే అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు.  చిన్ముద్ర అంటే ఏమిటి? “చిత్” అంటే చైతన్యం, జ్ఞానం.“ముద్ర” అంటే సంకేతం లేదా జ్ఞానాన్ని సూచించే భంగిమ. దక్షిణామూర్తి స్వామి చేతిలో కనిపించే చిన్ముద్రలో బొటనవేలు చూపుడు వేలు పరస్పరం తాకి, మిగిలిన మూడు వేళ్లు వంగి ఉంటాయి. బొటనవేలు — పరమాత్మ తత్త్వం  బొటనవేలు స్వతంత్రంగా నిలిచినట్లుగా ఉంటుంది.  ఇది పరబ్రహ్మం / పరమ చైతన్యాన్ని సూచిస్తుందని వేదాంత సంప్రదాయంలో వివరిస్తారు. చూపుడు వేలు — జీవాత్మ  మనలోని “నేను” అనే భావాన్ని సూచిస్తుంది. జీవుడు తనను శరీరం, మనస్సు, ఇంద్రియాలతో మాత్రమే గుర్తించుకుంటున్నంతకాలం పరమసత్యాన్ని పూర్తిగా గ్రహించలేడు. చూపుడు వేలు బొటనవేలిని తాకడం జీవాత్మ–పరమాత్మ ఏకత్వాన్ని సూచించే సంకేతంగా అర్థం చేసుకుంటారు. నిజమైన ఆత్మజ్ఞానం కలిగినప్పుడు “నేను వేరు, పరమసత్యం వేరు” అనే భేదభావం తొలగి ఆత్మస్వరూపాన్ని తెలుసుకున...

సముద్ర మథనం

చిత్రం
సముద్ర మథనం హాలాహల విషం మరియు 'నీలకంఠుడు' రహస్యం సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం మరియు శివపురాణ కాలగణన ప్రకారం, దేవతలు మరియు అసురుల మధ్య జరిగిన మహత్తర క్షీరసాగర మథనం ఈ పవిత్రమైన శ్రావణ మాసంలోనే పరాకాష్టకు చేరుకుంది. ఈ పవిత్ర మాసం, సముద్ర మథన ఘటన మరియు శివుని 'నీలకంఠుడు' అనే దివ్య స్వరూపం మధ్య ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ మాసంలోనే హాలాహల విషం ఎందుకు ఉద్భవించింది? శివపురాణ కథనాల ప్రకారం, దేవతలు మరియు దైత్యులు అమృతాన్ని పొందాలనే సంకల్పంతో క్షీరసాగరాన్ని మథించడం ప్రారంభించారు. ఇందుకోసం మందరాచల పర్వతాన్ని మథన దండంగా, నాగరాజు వాసుకిని తాడుగా ఉపయోగించారు. ఈ మథన ప్రక్రియలో మొదటగా అత్యంత భయంకరమైన హాలాహల (కాలకూట) విషం వెలువడింది. ఆ విషం నుంచి వెలువడిన తీవ్రమైన వేడి, జ్వాలల వల్ల సమస్త సృష్టి భయాందోళనకు గురైంది. ఈ మహత్తర సంఘటన అంతా శ్రావణ మాసంలోనే జరిగింది. విశ్వాన్ని రక్షించడానికి మరే మార్గమూ కనిపించనప్పుడు, లోకక్షేమం కోసం శివుడు ఆ భయంకరమైన విషాన్ని స్వీకరించారు. ఆ విషం శరీరమంతా వ్యాపించకుండా నిలిపివేయడాని...

ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు

చిత్రం
 ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు చంద్రో వికాసయతి కైరవ చక్రవాలం న భ్యర్థితో జలధరోపి జలం దదాతి సంతః స్వయం పరహితాభి యోగాః అర్థము:--ఎవరూ ప్రార్థించకుండానే సూర్యుడు పద్మములను వికసింప జేస్తున్నాడు, చంద్రుడు కలువలను నవ్వించు చున్నాడు, అడుగకయే మేఘుడు వర్ష ధారలు గురిపించి జీవన దాన మొనర్చు చున్నాడు: సత్పురుషులు తమంత తామే పరహితమును చేయుటకు పరమోత్సాహము కలిగి యుందురు కదా! పరోపకరణం యేషాం జాగర్తి హృదయే సతామ్ నశ్యంతి విపదేస్తేషాం సంపదః స్యుః పదే పదే తీర్థస్నానైర్న సా శుద్ధిర్బహుదానైర్న తత్ఫలమ్ తపోభిరుగ్రైస్తన్నాప్య ముపకృత్యా యదాప్యతే… భావము:--ఏ సుజనుల హృదయంలో పరోపకార భావన జాగరూకమై వుంటుందో వారి ఆపదలన్నీ తొలగిపోతాయి. సంపదలెన్నో వారికి ప్రాప్తిస్తాయి. పరోపకారం వల్ల ప్రాప్తించే పవిత్రత అనేక పుణ్య తీర్థాలలో స్నానం ఆచరించినా ప్రాప్తించదు. అందువల్ల కలిగే పుణ్యఫలితం అధిక దానాలు చేసినా, తీవ్ర తపస్సు చేసినా కలుగదు. నిష్కామ భావనతో పరోపకారం చేయడం కోసం పాటుపడేవారికి భగవత్ప్రాప్తి కూడా కలుగుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. విప్రాణాం జ్ఞానతో జైష్ట్యం క్షత్రియాణాం తు వీర్య: వైశ్యా...

కర్మసూక్ష్మం...

చిత్రం
కర్మసూక్ష్మం... .. ఒక రోజు  అవధూత  వెంకయ్య స్వామి వారి వద్దకు  ఒక స్త్రీ, ఆమె ముగ్గురు కుమార్తెలూ బాగా ఆకలితో వచ్చారు. అప్పుడు స్వామి వారికి ఆశ్రమంలో అన్నం పెట్టించారు. విస్తరి లోని అన్నాన్ని తల్లి కంటే ముందుగా ఆ బిడ్డలు తినేశారు. మరలా అన్నం వడ్డించి అందరికి తృప్తి కలిగించారు. వారు  వెళ్లిన తరువాత స్వామి వారు తన భక్తులతో.. ఇలా అన్నారు.. 'ఆమేకు వీళ్ళు ముగ్గురే కాదు.. ఆమేకు ఇంకా ఇంటి దగ్గర నలుగురు బిడ్డలున్నారు.. పూర్వం  ఆమె వెంకటగిరి రాజా గారి కోడలు. అప్పట్లో తన ఏడుగురు దాసీలకు అన్నం పెట్టకుండా అమే మొత్తం హాయిగా భోజనం చేసేది. ఆ ఏడుగురు దాసీలే.. ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఇప్పుడు ఆమెను తిననివ్వకుండా బాధిస్తున్నారు'.. కర్మసూక్ష్మం అన్నది ఎంత క్లుప్తంగా కనిపిస్తుందో చూసారా... || ఓం నమః శివాయ || సర్వేజనా సుఖినో భవంతు   శుభమస్తు వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్...

స్త్రీలు చేయకూడని పనులు

చిత్రం
        స్త్రీలు చేయకూడని పనులు గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది. ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్ణమవ్వడానికి కావలసిన ఆమ్లములు ఉండవు. అందువల్ల జీర్ణము కాదు. ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు.  మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును. మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను. మీరు, మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు ఐతే ఈ కాలములో అందరూ దీనిని తప్పక చేస్తుంటారు. స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు. దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు. ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .పరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది. కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు...